Skip to content
www.9newstelugu.com
Menu
  • Home
  • Blog
  • Politics
  • Salur
    • Crime
    • Bobbili
  • Parvathipuram
    • Devotion
  • Privacy Policy
  • Blog
  • 9newstelugu.com
  • శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ తయారీపై వర్క్ షాప్
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
  • రాష్ట్రం హక్కు కేంద్రం లాగేసింది
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
  • నడిరోడ్డుపై కత్తితో పీక కోసుకున్న యువకుడు.
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
Menu

నడిరోడ్డుపై కత్తితో పీక కోసుకున్న యువకుడు.

నడిరోడ్డుపై కత్తితో పీక కోసుకున్న యువకుడు…

భీమవరం…

జిల్లా కేంద్రమైన భీమవరంలో నడిరోడ్డుపై యువకుడు  కత్తితో పీక కోసుకొన్న సంఘటన చోటు చేసుకుంది, దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం,నియోజకవర్గ కేంద్రమైన ఉండి పెదపేటకు చెందిన గాతల క్రాంతి కుమార్ (36) అనే యువకుడు శనివారం భీమవరం పట్టణం ఉండి రోడ్ మల్టీప్లెక్స్ సమీప రోడ్లో  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గాతల క్రాంతి కుమార్ ఫిష్ ప్యాకింగ్ పనికి వెళుతూ ఉంటాడని. శుక్రవారం అతనికి గాయం కావడంతో శనివారం ఉదయం అతనిని ఉండి ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం భీమవరం ప్రభుత్వ
ఆసుపత్రికి తండ్రి జాన్ తీసుకువచ్చారు. ఆసుపత్రికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి క్రాంతి కుమార్ బయటకు వెళ్లి ఎమ్మార్వో ఆఫీస్
సెంటర్లోని ఒకరి ఇంటిలోకి వెళ్లి తనను చంపి వేస్తారుతలుపులు వేసేయండి అని అరిచినట్లు కొందరు చెబుతున్నారు. ఆ గృహంలో
ఉన్నవారు అతనిని దొంగ అనుకుని అక్కడ నుండి పోలీసులకు, ఫోన్ చేయగా అక్కడే ఉన్న తన తండ్రి జాన్  వచ్చి  అతను తన కుమారుడని దొంగ కాదని పనికి వెళుతూ ఉంటాడని, ఆసుపత్రికి వచ్చామని స్థానికులకు చెప్పినట్లు సమాచారం.ఈ నేపథ్యంలో క్రాంతి కుమార్ను స్థానికులు, పోలీసులు వదిలివేశారు.అనంతరం
తండ్రి అతనిని తీసుకొని వర్మ ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా మార్గ మధ్యలో ఎనమదుర్రు  కాలువలో క్రాంతికుమార్ దూకి వేశాడు. అక్కడ ఉన్న ప్రజలు, పోలీసులు ఆ కాలువ నుండి అతనిని బయటికి లాగారు. అక్కడ నుండి క్రాంతి కుమార్ పండ్ల వర్తకుల వద్ద ఉండే చాకులు కత్తులు వంటివి బలవంతంగా తీసుకుని ఉండి
రోడ్డు మల్టీప్లెక్స్ సెంటర్ వరకు పరుగు తీశాడు, తండ్రి అతడును అదుపు చేయలేకపోయాడుచేయలేకపోయాడు అట్టి
పరిస్థితుల్లో ప్రజలు కూడా భయభ్రాంతులయ్యారు. తమ మీద ఎక్కడ
కత్తితో దాడి చేస్తాడోనని భయపడడంతో ఎవరూ కూడా అతని చేతిలోఉన్న కత్తిని ధైర్యంగా బలవంతంగా తీసుకోలేకపోయారు. ఈ
నేపథ్యంలో క్రాంతి కుమార్ కత్తితో చెయ్యి, కాలు, పీకను కోసేసుకున్నాడు. అనంతరం  స్పృహతప్పి పోయిన అతనిని భీమవరం ప్రభుత్వఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ విషయంపై భీమవరం టూ టౌన్ సీఐ కాళీ చరణ్. సంఘటన ప్రాంతాన్ని పరిశీలన చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

©2025 www.9newstelugu.com | Design: Newspaperly WordPress Theme