*అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు* :
స్థానిక గరివిడి అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజనీరింగ్ కాలేజీలో ఆదివారం ఉదయం ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జాషువా జయప్రసాద్ గారు అధ్యక్షతన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమంలో ముందుగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలను,దేశభక్తి గీతాలును ఆలపించారు.ఈ సందర్బంగా కాలేజీ ప్రిన్సిపాల్ వి.జాషువా జయప్రసాద్ గారు మాట్లాడుతూ భారతదేశానికి రాసుకున్న రాజ్యాంగం సంపూర్ణంగా అమలులోకి వచ్చిన రోజు ఇది.ఈరోజు నుండి భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ,సమానత్వం,లౌకిక తత్వం,న్యాయం పూర్తిగా ఒక హక్కుగా పొందడం జరిగిందిని తెలియజేశారు.ముఖ్యంగా భారతదేశం అనేక మతాలు,కులాలు,జాతుల కలిగిన దేశం అయినప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశమని తెలియజేశారు.మరియు సమాజంలో ప్రతి పౌరుడు హక్కులు ఉపయోగించుకుంటూ బాధ్యతలు విస్మరించకుండా దేశ సేవకు,దేశాభివృద్ధికి తోడ్పడలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.వెంకటరమణ,ఏఓ జి.అనిల్ కుమార్,వివిధ విభాగాధిపతులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు బోధనేతర సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.




