యాచకులకు అన్నదానం

యాచకులకు అన్నదానం

జిల్లెళ్ళమూడి కాలేజ్ విశ్రాంత ప్రధానాచార్యులు కర్మయోగి,శిష్య వాత్సల్య జలధి అయిన  శ్రీ విఠాల రామ చంద్రమూర్తిగారి సంతాప సభ సాలూరు లో రామాఫౌండేషన్ అమ్మ బడి వ్యవస్థాపక కార్య దర్శి శివలెంక ప్రసాదరావు మాష్టారు ఆధ్వర్యం లో ఘనంగా జరిగింది.

ఆయన ఈ లోకాన్ని వదిలినప్పటికీ గొప్ప భావనగా శిష్యులు మనస్సులో ఉంటారని ,ఆయన సేవా నిరతి,ధార్మిక జీవితం తమకెప్పుడూ ఆదర్శంగా ఉంటాయని ప్రసాదరావు మాష్టారు పేర్కొన్నారు.రామచంద్ర మూర్తి గారి సపిండీ కరణ సందర్భంగా ఈ రోజు 200 మంది నిరుపేదలకు యాచకులకు ఆహార పదార్థాలను ఆయన ,ఆయన శిష్య బృందం పంపిణీ చేశారు.ఆయన ఆశయాలను సిద్ధాంతాలను ఇక ముందు కూడా కొన సాగిస్తామని తెలియజేశారు.జిల్లెళ్ళమూడి అమ్మ,తన గురువు గారు తనకు రెండు నేత్రాలుగా వివరించారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి