సాలూరు RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సుల ప్రారంభోత్సవం లో పాల్గొన్న మంత్రి సంధ్యారాణిపార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని RTC కాంప్లెక్స్ వద్ద నూతన బస్సులను మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి ఇవాళ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు మరింత మెరుగైన రవాణా సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.నూతన బస్సుల ప్రారంభం ద్వారా పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించగలరని మంత్రి పేర్కొన్నారు.ఈ బస్సుల ద్వారా ముఖ్యమైన ప్రాంతాలకు మరింత విస్తృతమైన రవాణా సదుపాయాలు అందించడంతో పాటు, ప్రయాణ ఖర్చును తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని మంత్రి వివరించారు. Spread the love టపా నావిగేషన్ 48గంటల లో కేసు ఛేదించిన పోలీసులు 06.04.25 న జరగబోవు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రమాణ స్వీకారం చెల్లుబాటు కాదు