పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుఅన్నదాత సుఖీభవ – రైతుల సంక్షేమానికి మరో మైలురాయిఈరోజు కోదండరామ కళ్యాణమండపంలో “అన్నదాత సుఖీభవ” కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.రాష్ట్రంలో రైతు కుటుంబాలకు మరియు భూమిలేని కౌలుదారులకు ప్రతి సంవత్సరం రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించే పథకం కింద, ఈ రోజు మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అక్షరాల రూ.7,000 చొప్పున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందజేస్తున్నారని మంత్రి తెలిపారు.*సాలూరు నియోజకవర్గంలో 31,294 మంది రైతులకు మొత్తం రూ.21.9 కోట్లు,**పార్వతీపురం మన్యం జిల్లాలో 1,22,260 మంది రైతులకు రూ.84.58 కోట్లు అందజేస్తున్నట్లు మంత్రి వివరించారు.*రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి డిసిసిబి చైర్మన్ కిమిడి నాగార్జున గారు, మాజీ ఎమ్మెల్యే భంజ్ దేవ్ గారు, జిల్లా కలెక్టర్ గారు, సాలూరు నియోజకవర్గం AMC చైర్మన్ ముఖి సూర్యనారాయణ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. Spread the love టపా నావిగేషన్ మక్కువ మండల గిరిజన గ్రామాలకు రగ్గులు పంపిన డిప్యూటీ సీఎం అటవీ పోడు భూములకు పూర్తిస్థాయిలో పట్టాల మంజూరు చేయాలి