పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈరోజు సిపిఎం ప్రజాసంఘాలు ఆస్పత్రిని మరియు రోగులను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా cpm జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తిస్థాయిలో వైద్యం అందించాలంటే 30 పడకలు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని. ముఖ్యంగా రక్త పరీక్షలు నిర్వహించే సిబ్బంది కొరత అనేది తీవ్రంగా ఉందని ఐటీడీఏ పరిధిలో రక్తపరీక్షలు నిర్వహించేందుకు మరో ఇద్దరిని నియమించాలని అన్నారు. మండల కేంద్రం పని ఒత్తిడి కూడా ఉండడం వలన సిబ్బంది కొరత లేకుండా చూడాలని అలాగే ఆసుపత్రిలో మంచినీటి వంటి మౌలిక సదుపాయం పూర్తిస్థాయిలో కల్పించాలని అలాగే హెడ్ క్వార్టర్ పరిధిలో మినీ గురుకులం కస్తూరిబాయి ఆశ్రమ పాఠశాల పాచిపెంట ఆశ్రమ పాఠశాల గర్ల్స్ ఆశ్రమం పాఠశాల లో ఉన్నటువంటి పిల్లలకు జ్వరాలు వస్తే హెడ్ క్వార్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కి పాచిపెంట తీసుకురావడం జరుగుతుందని మంచాలు లేక చాలక ఒకే మంచం మీద ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఉండవలసిన పరిస్థితి పేషెంట్లు కూడా అదే పరిస్థితి ఉంటుందని కాబట్టి 30 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు రక్తపరీశులు సంబంధించి మరో ఇద్దరిని నియమించాలని ఐటీడీఏ పరిధిలో అధికారుల ఆలోచించాలని కోరారు ఒకే ఒక్కరు రక్తపరీక్షలు నిర్వహిస్తున్నారు సిబ్బందిని నియమించాలని కోరారు జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీవో డిఎం అండ్ హెచ్ ఓ స్పందించి ఇటువంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పాచిపెంట మరియు గురువు నాయుడుపేట ఇతర ప్రాంతాల్లో అనగా తోనాం మామిడిపల్లి బాగువలస ఇటువంటి పీహెచ్సీలు కూడా అభివృద్ధి చేయాలని పాచిపెంట హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 30 పడకలు ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని ప్రత్యేకమైనటువంటి దృష్టి అధికారులు పెట్టి మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు







