ఈరోజు సాలూరు పట్టణంలో పీపుల్స్ స్టార్ట్ సినీనటుడు రెడ్డి.నారాయణ మూర్తిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్య మంత్రి & గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు పీడిక.రాజన్నదొర గారిని ఆయన నివాసం లో మర్యాద పూర్వకంగా కలిశారు.తెలుగు సినీ పరిశ్రమలో అరుదైన వ్యక్తిత్వం ఉన్న వారిలో ఆర్.నారాయణమూర్తి ఒకరు. నటుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం,ప్రజా సమస్యలను వెండితెరపై ప్రతిబింబించే దర్శకునిగా, నిర్మాతగా పరిణమించింది. సామాజిక చైతన్యాన్ని, సామాజిక న్యాయాన్ని తన సినిమాలలో చూపించి ప్రజలని చైతన్యవంతులుగా మార్చే ప్రయత్నం చేశారు.ఈ కార్యక్రమం లో సాలూరు మండలం వైస్ ఎంపీపీ రెడ్డి. సురేష్ గారు,కురుకుట్టి ఎంపీటీసీ గెమ్మెల. సుబ్బు గారు మరియు తదితరులు ఉన్నారు.
