పాచిపెంట మండల వ్యవసాయ శాఖ అధికారి కొల్లి.తిరుపతిరావు గారు (50సం.లు)గుండెపోటుతో మృతి.* భౌతికాయాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారు మరియు తదితరులు.* ఏవో తిరుపతి గారి హఠాన్మరణంతో కన్నీటి పర్యాంతమైన తోటి ఉద్యోగులు. పుడమితల్లి ఒడిలో నిస్వార్థ సేవలు అందిస్తూ నిత్యం వృత్తిపట్ల నిబద్ధతతో పనిచేసే వ్యక్తిత్వం గల *పాచిపెంట మండలం వ్యవసాయశాఖ అధికారి కొల్లి.తిరుపతిరావు (50సం.లు)గారు* గుండెనొప్పి రావడంతో విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న హఠాన్మరణం చెందారు.ఈ విషయం తెలుసుకున్న *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి వర్యులు&మాజీ గిరిజన సంక్షేమ శాఖా మాత్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు ఈరోజు సాలూరు పట్టణం వెలమపేటలో ఉన్న కొల్లి.తిరుపతిరావు గారి నివాసానికి వెళ్లి ఆయన భౌతికాయాన్ని సందర్శించి పూలమాల వేసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.ఆయన ఆకస్మిక మృతి చాలా బాధాకరమని,వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరానన్నారు.ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి తిరుపతిరావు గారి కుటుంబ సభ్యులతో *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గారు మాట్లాడుతూ వారిని ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.రైతులు పట్ల ఎనలేని సేవలు అందించారని పలువురు కొనియాడారు.ఏవో తిరుపతిరావు గారి హఠాన్మరణం జీర్ణించుకోలేని వార్త అని,విధి నిర్వహణలో ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకొని తోటి ఉద్యోగులు కన్నీటి పర్యాంతమయ్యారు.ఈ కార్యక్రమంలో సాలూరు నియోజక వర్గ తాజా,మాజీ ప్రజాప్రతినిధులు, పలు రాజకీయ పార్టీ నాయకులు, స్నేహితులు,బంధువులు, తోటిఉద్యోగస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.. Spread the love టపా నావిగేషన్ క్లోరినేషన్ సిలిండర్ లీకేజీ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన*అరకు పార్లమెంట్ అధ్యక్షులు మోజురు తేజోవతి బడ్జెట్ ను చూసి YCP కి కళ్ళు తిరిగాయి