ఉమ్మడి విజయనగరం జిల్లా సాక్షి టీవీ ఛానల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అల్లు.యుగంధర్ గారు కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.కాలికి శస్త్రచికిత్స జరిగిన అనంతరం వైద్యుల సలహాలు మేరకు ఆయన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం, మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు పీడిక.రాజన్నదొర ఈరోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలం దరి జేఆర్ పురం వద్ద నివాసముంటున్న సాక్షి టీవీ ఛానల్ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ అల్లు.యుగంధర్ గారి దగ్గరికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్బంగా యుగంధర్ గారితో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర మాట్లాడుతూ ఆయన ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.


