పాండ్రంకి వెంకట రమణపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతుందివిజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావువిజయనగరం పట్టణంకు చెందిన పాండ్రంకి వెంకట రమణపై అనే వ్యక్తిపై ఇటీవల భోగాపురం మండలంలో ముంజేరు మరియు వివిధ గ్రామాలకు చెందిన కొంతమంది ఫిర్యాదు చేసి చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ గారిని ఆశ్రయించారన్నారు. పాండ్రంకి వెంకట రమణ ముంజేరు గ్రామం డ్రైనేజీ కాలువ సమస్యపై గ్రామంలో అందరిని రెచ్చగొట్టి భోగాపురం మండల కేంద్రం వద్ద రిలే నిరాహార దీక్షలు చేయిస్తున్నాడని, ఈ విషయమై వివిధ శాఖల అధికారులను, రాజకీయ నాయకులను, వివిధ కంపెనీల వారిని బెదిరిస్తూ డబ్బులు వాసులు చేస్తున్నాడని, అదే విధంగా ముంజేరు గ్రామ ప్రజలను కూడా చందాలు ఇవ్వమని, లేకపోతే అట్రాసిటి కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్కడ లాడ్జి నిర్మాణం చేసి, అందులో దందాలు నడుపుతున్నాడని, “అంబేద్కర్ రైట్స్” పేరిట ఒక అనధికార సంస్థను ఏర్పాటు చేసుకొని, దానికి తానే అధ్యక్షుడినని చెప్పుకొంటూ సెటిల్మెంట్లు, దందాలు చేస్తూ పోలీసు వారిని కూడా బెదిరిస్తుంటాడని, అదే విధంగా తన అనుచరులతో కలిసి భోగాపురం మండలంలో హేచరీలు, కంపెనీలు వద్దకు వెళ్లి లక్షలలో డబ్బులు వసూలు చేస్తున్నాడన్నారు. ముంజేరు గ్రామంలో కూడా కొంతమందిని చందాలు ఇవ్వమని, దళితులనుండి ఏ సమస్య వచ్చినా తానూ చూసుకుంటానని, ఒక వేళ చందాలు ఇవ్వకపోతే తమపై అట్రాసిటి కేసులు పెడతామని బెదిరిస్తున్నాడని ఆరోపించారని బాధితులు తెలిపారు. ఈ విషయంపై విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు విచారణ అధికారిగా నియమించారని తెలిపారు. విజయనగరం ఇంచార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ – పాండ్రంకి వెంకట రమణ అనే వ్యక్తిపై అనేక ఆరోపణలతో వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టామని, కొంతమంది బాధితుల స్టేట్మెంట్లు నమోదుచేసామని, తేది.20.02.2026 న భోగాపురం పోలీస్ స్టేషన్ లో ఉదయం నుండి తాను అందుబాటులో ఉంటానని, ముంజేరు మరియు చుట్టు పక్కల గ్రామాల వారు ఈ విషయం గురించి ఎవరైనా ఏదైనా చెప్పాలంటే తనను నిర్భయంగా కలిసి తమ బాధలు చెప్పుకోవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే విచారణ పూర్తి చేసి నివేదికను పై అధికారులకు సమర్పిస్తానని తెలిపారు. Spread the love టపా నావిగేషన్ రహదారులు భద్రతకు స్పందించిన పోలీస్ అధికారులు..