మహాత్ముని సేవలు ఆదర్శనీయం – ఎమ్మెల్యే కళావెంకటరావు గారు!

మహాత్ముని సేవలు ఆదర్శనీయం – ఎమ్మెల్యే కళావెంకటరావు గారు!



దేశానికి స్వాతంత్ర్యం రావడానికి గాంధీజీ నిస్వార్ధంగా సేవలందించారని చీపురుపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ కిమిడి కళావెంకటరావు గారు అన్నారు.

నేడు గాంధీ జయంతి సందర్భంగా రాజాం తమ నివాస కార్యాలయంలో గాంధీ మహాత్ముని చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కళావెంకటరావు గారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ గారు అహింస వాదంతో ముందుకు వెళ్లి మనకు స్వాతంత్రాన్ని సాధించారని అన్నారు.

బ్రిటిష్ వారు ఎన్ని ఇబ్బందులు పెట్టిన అహింసా సిద్ధాంతంతోనే ముందుకు వెళ్లారని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిడిపి కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి