Skip to content
www.9newstelugu.com
Menu
  • Home
  • Blog
  • Politics
  • Salur
    • Crime
    • Bobbili
  • Parvathipuram
    • Devotion
  • Privacy Policy
  • Blog
  • 9newstelugu.com
  • శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా జయప్రదం చేయండి
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో సోలార్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ తయారీపై వర్క్ షాప్
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
  • అవంతీస్ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
  • గరివిడి తశిల్దార్ గారికార్యాలయంలో ఘనంగా జరిగిన 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు…
  • రాష్ట్రం హక్కు కేంద్రం లాగేసింది
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
  • నడిరోడ్డుపై కత్తితో పీక కోసుకున్న యువకుడు.
  • అతడికి 20.. ఆమెకి 17..ప్రేమంటూ వెంటబడ్డారు.
Menu

యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి

Posted on 07/06/2025



అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సన్నాహకంగా సాలూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలోస్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు యోగా అభ్యాసానికి ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం ఇవ్వాలని పిలుపునిచ్చారు.

“మన దైనందిన జీవనశైలిలో యోగా భాగమైనప్పుడే శారీరకంగా, మానసికంగా ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది. యోగా మన ఆరోగ్యానికి మెరుగైన మార్గం. జూన్ 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో జరుపుకోవడం తెలుగు ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను. ఆ వేడుకల్లో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు స్వయంగా పాల్గొనబోతున్నారు” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని సాలూరు మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు.

Spread the love

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

©2025 www.9newstelugu.com | Design: Newspaperly WordPress Theme