సాలూరులో పండగ పూట చీకటి : రోడ్డుపై ప్రజల పోరాటం!విద్యుత్ లేని వేదన… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం ఉవ్వెత్తునమన్యం ప్రాంతమైన సాలూరులో గత రెండు రోజులుగా గాఢ అంధకారం నెలకొంది. ఎడతెరపిలేని విద్యుత్ కోతలతో విసిగిపోయిన ప్రజలు రాత్రి చిమ్మచీకట్లోనే రోడ్డుపైకి వచ్చారు. నిర్లక్ష్యానికి భగ్గుమంటూ నిరసనకు దిగారు.విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం చెలరేగింది. అధికారులైన ఏఈ నాగేశ్వరరావు, ఏడీఈ రంగారావులను స్థానికులు ఒక గదిలో నిర్బంధించారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది.హైవేపై పెద్ద సంఖ్యలో ప్రజలు బైఠాయించడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రజల ఆందోళనను అదుపు చేయలేని స్థితికి చేరిన పోలీసులు చివరికి అదనపు బలగాల కోసం ఉన్నతాధికారులను ఆశ్రయించాల్సి వచ్చింది.ఈ ఘటన సాలూరులో అధికార యంత్రాంగం వైఫల్యాన్ని మరింత మచ్చుగా చూపిస్తోంది. Spread the love టపా నావిగేషన్ Shayamalambha festival grand success లచ్చిరాజు పేట కాశి అన్నపూర్ణ ఆలయం లో ఘనంగా హనుమాన్ జయంతి