పార్వతీపురం మన్యం జిల్లా
మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి సుప్రీంకోర్ట్ లో ఊరట
పుష్పశ్రీవాణి గిరిజనురాలే అంటూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు
గతంలో పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదని స్పెషల్ లీవ్ పిటీషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే నిమ్మక.జయరాజు
2024 అక్టోబర్ లో స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్ట్
హైకోర్టు తీర్పును ఆపిల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే జయరాజు
ఎట్టకేలకు ఆధారాలు పరిశీలించి సుప్రీంకోర్టులో కూడా పుష్పశ్రీవాణి పై వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసిన ధర్మాసనం.
యాంకర్:
మాజీ ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణికి సుప్రీంకోర్ట్ లో ఊరట లభించింది.పుష్పశ్రీవాణి గిరిజనురాలే అంటూ సుప్రీంకోర్ట్ తీర్పు ఇచ్చింది.గతంలో పుష్ప శ్రీవాణి గిరిజనరాలు కాదంటూ మాజీ ఎమ్మెల్యే నిమ్మక.జయరాజు కోర్టులో పిటిషన్ దాకలు చేసారు.
అయితే సరైన ఆధారాలను కోర్టులో అందజేయలేకపోవడంతో 2024 అక్టోబర్ లో ఆ పిటిషన్ ను హైకోర్ట్ కొట్టివేసింది.హైకోర్టు తీర్పును ఆపీల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించినా మాజీ ఎమ్మెల్యే జయరాజుకు చుక్కేదురు తప్పలేదు.
ఎట్టకేలకు ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం పుష్పశ్రీవాణి పై వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను కొట్టివేసి ఆమె స్వచ్ఛమైన గిరిజనురాలే అంటూ తీర్పు ఇచ్చింది.
