మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు ఈరోజు శ్రీ శ్రీ శ్యామలాంబ అమ్మవారి దర్శనం చేసుకుని, ఇటీవల జరిగిన అమ్మవారి ఉత్సవానికి సంబంధించిన ఆర్థిక లెక్కలు సమీక్షించారు.
ఈ సందర్భంగా ఉత్సవానికి వచ్చిన విరాళాలు మరియు ఖర్చుల వివరాలు వెలుగులోకి తెచ్చారు. విరాళాల పరంగా 5 లక్షలు విరాళంగా ఇచ్చినవారినుండి 20 రూపాయలు విరాళంగా ఇచ్చిన సాధారణ భక్తుల వరకు అందరి వివరాలు లెక్కల్లో పొందుపరచడం జరిగింది.
ఈ సందర్భంగా:
లక్ష రూపాయలకుపైగా విరాళం ఇచ్చినవారు 25 మందిగా ఉండగా, వారు కలిపి ఇచ్చిన మొత్తం 51 లక్షలు.
మొత్తం విరాళంగా వచ్చిన మొత్తం: ₹75,33,247
ఉత్సవానికి ఖర్చయిన మొత్తం: ₹56,49,849
మిగిలిన ₹18,83,398 ను సాలూరు కో-ఆపరేటివ్ బ్యాంకులో ఉత్సవ కమిటీ ఖాతాలో జమ చేయడం జరిగింది.
ఈ ప్రకటనతో ఉత్సవంలో విరాళాలు సేకరణ, ఖర్చులు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడినట్టు మంత్రివర్యులు తెలిపారు. భక్తులు ఇచ్చిన ప్రతి పైసా విలువైనదని, దేవస్థానం అభివృద్ధిలో ప్రతిఒక్కరి భాగస్వామ్యం ప్రశంసనీయమని మంత్రి అన్నారు.



