పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

జనసేనని  శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్యామలాంబ దేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ గారి గోత్ర నామంతో అర్చనలు పూజ చేయించడం జరిగింది. తదుపరి సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మినిస్టర్ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ జంక్షన్లో కేక్ కటింగ్ జరిగింది. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ముక్కు సూటితనం, ఆయన నిబద్ధత, సిద్ధాంతపరమైన రాజకీయాలు యావత్తు యువతకు మార్గదర్శకం అని కొనియాడారు…  తధానంతరం సాలూరు వై సి టీలో మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పళ్ళు బ్రెడ్లు పంచడం జరిగింది….
ఈ కార్యక్రమంలో సాలూరు మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివకృష్ణ, పిఎసిఎస్ డైరెక్టర్ మీసాల నవీన్ కుమార్, జనసేన లీగల్ సెల్ అడ్వైజర్ సుశాంత్ కుమార్,సీనియర్ నాయకులు వసంతుల శ్రీను, మురళి హేమంత్ భాను తదితరులు పాల్గొన్నారు…
మరియు సాయంత్రం జరగబోయే వివిధ జంక్షన్ కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాల్గొని ఈ జనసేన పండుగను విజయవంతంగా నిర్వహిస్తారని తెలియజేశారు…

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి