తిరుమల ప్రసాదాలపై టీటీడీ శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై అనేక పిర్యాదు చేశాం ప్రసాదాలు నాణ్యత లేదని, దిట్టం సరైన పద్ధతితో చేయడం లేదని, రుచిలో కూడా మార్పు వచ్చిందని అప్పటి ఈవో, చైర్మన్ల దృష్టికి తీసుకెళ్లాం నా పిర్యాదులు కనీసం పట్టించుకోలేదు గత ఐదేళ్ల పాలనలో నాసిరకం అన్న ప్రసాదం, నివేదించారు సిఎంగా చంద్రబాబు అధికారం చేపట్టగానే టీటీడీలో ప్రక్షాళన చేపట్టారు అనేక అంశాల్లో ప్రక్షాల చేస్తూ వస్తున్నారు… నేను ల్యాబ్ రిపోర్టర్ చూశాను ల్యాబ్ రిపోర్ట్ అనుగుణంగా అందులో వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ ఉన్నట్లు తెలిసింది నాణ్యతపై లోపాలు ఎత్తి చూపినందుకు నన్ను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసింది. కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు అధికారులు ప్రభుత్వ కేసుల వల్ల ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది ఇప్పుడు శ్రీవారి కైంకర్యాలు ఎలా జరుగుతుందని, ఇప్పుడున్న ప్రధాన అర్చకులు చెప్పాల్సి ఉంది ప్రశ్నించినందుకే నన్ను అనేక ఇబ్బందులకు గురి చేశారు…. అయినా స్వామి వారి కైంకర్యాలు సజావుగా సాగాలని కోరుకున్న ఆగమ శాస్త్రం అనుసారం నైవేద్య సమర్పణ జరగటం లేదు కోవిడ్ సమయంలో దిట్టని తగ్గించారు…. చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే అపచారమే తక్కువ దిట్టం చేయడం అపచారం ఆర్గానిక్ ప్రసాదంను వ్యతిరేకించా…. స్వామి వారికి కొన్ని వేల సంవస్థరాలుగా వస్తున్న ఆచారం ప్రకారమే అన్నప్రసాదం నివేదించాలని స్పష్టం చేశా పాడైపోయిన అర్చక వ్యవస్థను, ఆలయ నిర్వహణను గాడిన పెట్టేందుకు నాకు ఓ అవకాశం ఇవ్వాలని కోరా. -ఏవి రమణ దీక్షితులు, శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు Spread the love టపా నావిగేషన్ ఆర్.ఎం.పీ. డాక్టర్ పోలాచారి కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న సీఐ అప్పలనాయుడు