చేతి బోర్ పంపు ను  కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు,

చేతి బోర్ పంపు ను  కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు,



       చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి పట్టణం లో20ఏళ్ల క్రితం కాలనీ వాసులకు నీటి ఎద్దడ లేకుండా  ఏర్పాటు చేసిన చేతి బోర్ పంపు ను  కొందరు అక్రమార్కులు పూర్తిగా తొలగించి ఆక్రమణ చేశారు,

     తొలగించిన ప్రదేశంలో ఆ ఆసామి ట్రాక్టర్, ఆటో,టాటా ఎస్,వాహనాలు నిలుపు స్థలం గా ఏర్పాటు చేస్తున్నా విషయంపై,

     ప్రశ్నించిన కాలనీవాసులపై  బెదిరింపులకు పాల్పడ్డారు.
   
     ఈ విషయమై బాధితులు స్థానిక  చీపురుపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ను కలసి తమ సమస్య ను వినిపించారు.
    ఈ విషయమై వెంటనే స్పందించిన  శ్రీనివాసరావు గారు గరివిడి ఎం.పీ.డీ.వో గారిని మరియు ఈ.ఓ గారిని సదరు విషయమై వివరణ కోరగా ,
      ఇప్పటికే దానిపై కంప్లైంట్ ఫైల్ చేసి పోలీసు వారికి అందించడం జరిగిందని తెలిపారు ,
     ఈ విషయమై స్థానిక ఎస్.ఐ గారిని కలిసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినవారు ఎంతటి వారైనా కేసులు నమోదు చేసి  చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరారు,
     తక్షణమే రెండు రోజుల్లో చేతి పంపు ఏర్పాటుచేసి కాలనీవాసులకు మంచినీటి ఎద్దడిని తీర్చవలసిందిగా అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక గరివిడి జనసేన పార్టీ నాయకులు సిగ తవిటినాయుడు , ఎడ్ల రమణ మరియు జన సైనికులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి