పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో స్థానిక మేధర వీధి రామ మందిరం వద్ద నీటి సరఫరా చేసే ప్రధాన పైపులైను కు రంద్రం పడడంతో ప్రజలకు చేరాల్సిన త్రాగునీరు వృధాగా రోడ్డుపై పోతుంది గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి ఉందని స్థానికులు తెలుపుతున్నారు. త్వరగా ఈ పైపు లైను ను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.








