విజయనగరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం బలోపేతమే ధ్యేయంగా మంగళవారం (11-08-2026) రోజున సమీక్షా సమావేశం జరిగింది. మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి ఈ సమావేశంలో పాల్గొని, సోషల్ మీడియా కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేసి పలు విలువైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి గారు, టౌన్ ప్రెసిడెంట్ ఆసపు వేణు గారు, జిల్లా సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ కనిశెట్టి సుధాకర్ గారు, సోషల్ మీడియా నాయకులు మరియు మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ సాలూరులో ఘనంగా తిరంగా యాత్ర