గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి , గిరిజన ప్రాంతాల్లో గర్భిణీలు, బాలింతలు, మరియు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారులకు పాలపోడి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా సాలూరు, పాచిపెంట, రంపచోడవరం, అనంతగిరి వంటి ఆదివాసీ ప్రాంతాల్లో ప్రారంభించామని మంత్రి తెలిపారు.
పోషకాహార లోపం నివారణకు, మాతా శిశు ఆరోగ్య సంరక్షణకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “ప్రతి గిరిజన తల్లి, ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. పాలపోడి వంటి పోషకాహార అంశాల ద్వారా మాతా శిశు మరింత బలపడతారు,” అని అన్నారు.







