విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 100 ప్రాంతాల్లో ప్రత్యేకంగా మెగా వాహన తనిఖీలు చేపట్టాలని పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* మెగా వాహన తనిఖీలను స్వయంగా పర్యవేక్షించిన విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* రహదారి నియమాలు పాటించి హెల్మెట్ ధరించిన వాహనదారులను జిల్లా ఎస్పీ గారు అభినందించి, బ్యాగులను బహుమతిగా అందజేశారు* సాయంత్రం 5 నుండి 8గంటల వరకు వాహనాలను తనిఖీ చేసిన సుమారు 500మంది పోలీసులు* విజయనగరం పట్టణంలో ముందుగా గుర్తించిన 100 ప్రాంతాల్లో జూలై 14న సాయంత్రం 5గంటల నుండి 8గంటల వరకు రహదారి భద్రత, నేర నియంత్రణలో భాగంగా పట్టణంలో ఆకస్మికంగా వాహన తనిఖీలను చేపట్టగా, తనిఖీలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – విజయనగరం పట్టణంలో వాహన తనిఖీలు చేపట్టేందుకు 100 ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు. ఈ తనిఖీల్లో సుమారు 500 మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందిని వినియోగించామన్నారు. ఈ తనిఖీల్లో వాహన పత్రాలు సక్రమంగా లేని వాహనాలను గుర్తించి, వాటిని సీజ్ చేసామన్నారు. వాహనాలు ప్రమాదాలకు గురైనపుడు సరైన ఇన్సూరెన్సు లేకుంటే కలిగే అనర్ధాలను వాహనదారులకు వివరించి, వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్సు ఉండాలని సూచించామన్నారు. ఇన్సూరెన్సు లేని వాహనాలకు ఈ-చలానా విధించేందుకు బదులుగా వెంటనే ఆయా వాహనాలకు ఆన్-లైనులో ఇన్సూరెన్సు చేయించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. మైనరు డ్రైవింగు, హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిపైన కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వాహన తనిఖీల్లో ప్రజలకు రహదారి భద్రత, సైబరు భద్రత, మహిళల భద్రత పట్ల, గంజాయి, మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్ధాలను వాహనదారులు, ప్రజలకు వివరించి, అవగాహన కల్పించామన్నారు. రహదారి భద్రత నియమాలు పాటించిన, హెల్మెట్ ధరించిన వాహనదారులను జిల్లా ఎస్పీ అభినందించి, వారికి బ్యాగులను బహుమతులుగా అందజేసారు. జిల్లా ఎస్పీ వాహస తనిఖీలను స్వయంగా పర్యవేక్షించి, తల్లి జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందని హెల్మెట్ ప్రాధాన్యతను ప్రజలకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది హెల్మెట్ ధరించకపోవడం వలన తలకు గాయాలై ప్రాణాలు కోల్పోతే కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయన్నారు. కావున, ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా రహదారి భద్రత ప్రమాణాలు పాటించాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు. ఈ తనిఖీల్లో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, పలువురు డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. Spread the love