*డబ్బీవీధి వైసీపీ నాయకుడు యడ్ల.శంకర్రావు గారికి మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర నివాళి.* సాలూరు పట్టణం,డబ్బీవీధికి చెందిన వైసీపీ నాయకులు యడ్ల.శంకర్రావు(62)గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న సాయంత్రం కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న *మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర* గ ఈరోజు ఉదయం డబ్బీవీధిలోని ఆయన నివాసానికి చేరుకుని యడ్ల.శంకర్రావు గారి భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ కుటుంబానికి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు,కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కీ.శే.యడ్ల.శంకర్రావు గారికి నివాళులర్పించారు. Spread the love టపా నావిగేషన్ వర్షాకాలం ప్రారంభం… సంచి డాక్టర్లు, దందా పై ఆందోళన