సాలూరులో డీజే సౌండ్స్పై పోలీసుల ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు సాలూరు, సెప్టెంబర్ 10: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు సాలూరు టౌన్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వినాయక ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యే వరకు పట్టణ పరిధిలో DJ Sounds, DJ Systems వినియోగించకూడదని స్పష్టం చేశారు. అధిక శబ్దంతో డీజేలు వినియోగించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగడంతో పాటు వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు, అనారోగ్యంతో ఉన్నవారిపై ప్రభావం చూపే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. అదే విధంగా అధిక శబ్దం కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వినాయక ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు, డీజే ఆపరేటర్లు, యువత పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు కోరారు. నిషేధం అమల్లో ఉన్న సమయంలో డీజేలను ఏర్పాటు చేయడం, వినియోగించడం లేదా అందుకు సహకరించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంలో డీజే పరికరాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ఉత్సవ నిర్వాహకులు ముందుగానే పోలీస్ శాఖ సూచనలు, అనుమతులు, నిబంధనలను తెలుసుకుని వాటికి అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. భక్తి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ.. ప్రజల భద్రత, ప్రశాంతతకు సహకరించాలని సాలూరు టౌన్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 9 న్యూస్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్ Spread the love టపా నావిగేషన్ అమావాస్య పర్వదినాన ప్రత్యేక అలంకరణలో పారమ్మ తల్లి