పారమ్మ కొండపై భక్తిశ్రద్ధల మధ్య అమ్మవారి దివ్య దర్శనం సాలూరు, సెప్టెంబర్ 10: అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని పారమ్మ కొండపై కొలువుదీరిన శ్రీ పారమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించారు. పుష్పాలు, వివిధ అలంకరణలతో ముస్తాబు చేసిన అమ్మవారి దివ్య స్వరూపం భక్తులను ఆకట్టుకుంది. అమావాస్య సందర్భంగా పరిమిత సంఖ్యలో భక్తులు పారమ్మ కొండకు చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన పారమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రార్థించారు. కొండపై నెలకొన్న ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి దర్శనం భక్తులకు భక్తిభావాన్ని కలిగించింది. అమావాస్య పర్వదినం సందర్భంగా శ్రీ పారమ్మ తల్లి దివ్య దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. 9 న్యూస్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్ Spread the love టపా నావిగేషన్ బైక్ దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్ శాంతియుత వినాయక ఉత్సవాలే లక్ష్యం