దేవాడలో వైభవంగా ఆలయ పునఃప్రతిష్ఠ – పాల్గొన్న కిమిడి రామ్ మాలిక్ నాయుడు

దేవాడ గ్రామంలో వెలసిన శ్రీ వినాయక, సుబ్రహ్మణ్య సహిత సీతారామాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ మాలిక్ నాయుడు  హాజరయ్యారు.

ఉదయం నుండే ఆలయంలో హోమాలు, జలాధివాసం, ప్రాణప్రతిష్ఠ వంటి శాస్త్రోక్త కార్యక్రమాలు నిర్వహించారు. రామ్ మాలిక్ నాయుడు గారు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రతిష్ఠా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తి మార్గం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని, గ్రామాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఐక్యమత్యం పెరుగుతుందని అన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన గ్రామస్థులను, దాతలను ఆయన అభినందించారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి