పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పద్మాపురం పంచాయతీ పరిధిలోని బడ్నాయకవలస గిరిజన గ్రామంలో “ఇంటింటికీ కూటమి ప్రభుత్వం – సంక్షేమ విజయాలు” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొని గ్రామంలోని ప్రజలను ఇంటింటికీ కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. Spread the love టపా నావిగేషన్ వైయస్సార్సీపి సోషల్ మీడియాను మరింత బలోపేతం చేయాలి 100 అడుగుల జాతీయ జెండాతో రిషి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఘన స్వాతంత్ర్య ర్యాలీ సాలూరు