విజయనగరం, ఏప్రిల్ 8: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, రీ సర్వే, మ్యుటేషన్స్ వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో రెవిన్యూ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పట్టాదారు పాసు పుస్తకాలు, రీసర్వే, 22 ఏ భూములు, పి జి ఆర్ ఎస్, రెవిన్యూ క్లినిక్, ఎస్.ఐ.ఆర్, సెన్సస్ తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం, రీసర్వే వేగవంతం చేయాలని తహసీల్దారులను ఆదేశించారు.. ఒక్క తప్పుకూడా లేకుండా పాసుపుస్తకాలను రూపొందించాలని, రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని స్పష్టం చేశారు. అదేవిధంగా మ్యుటేషన్లను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే రెవిన్యూ రికార్డులు డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన గ్రామాల్లో పట్టాదారు పాసుబుక్ లలో లోపాలు సరిదిద్ది నూరుశాతం తప్పులు లేని పుస్తకాలు భూ యజమానులకు అందించాలని తెలిపారు. పి జి ఆర్ ఎస్, రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలలో వచ్చిన అర్జీ లను త్వరగా పరిష్కారం చేయాలని, రీ ఓపెన్ అయిన అర్జీ లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అర్జీదారునితో మాట్లాడాలన్నారు. జాయింట్ ఎల్ పి ఎం సమస్యను జూన్ లోగా పరిష్కరించాలని, రికార్డు లు సరిచేయాలని తెలిపారు. రెవిన్యూ పిటిషన్లు కు సంబంధించి తహశీల్దార్లు వ్యక్తిగతంగా హాజరు కావాలని అన్నారు. రెవెన్యూ క్లినిక్ లో వచ్చిన పిటీషన్లను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, వాట్సప్ గవర్నెన్స్ సేవలు పెరగాలని రెవిన్యూ అధికారులకు ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమానికి సంబంధించి మ్యాపింగ్ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు. *జిల్లాలో గ్యాస్ కొరత లేదు*: జిల్లాలో ఎల్ పి జి కొరత లేదని జాయింట్ కలెక్టర్ తెలిపారు. మండల నోడల్ అధికారులుగా తహసీల్దార్ లు గ్యాస్ ఏజెన్సీలలో తనిఖీ లు నిర్వహించాలని తెలిపారు. బుకింగ్ సీరియల్ ప్రకారంగా మాత్రమే గ్యాస్ డెలివరీ చేయాలని, అవకతవకలకు పాల్పడే ఏజెన్సీ లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా డెలివరీ ప్రాతిపదికన సిలిండర్లు అందించాలని, ప్రస్తుతం ఏడు రోజుల వ్యవధిలో డెలివరీ జరుగుతున్నదని, అంతకుమించి వెయిటింగ్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చి గ్యాస్ అందించాలని తెలిపారు. పాఠశాలలు సాంఘిక సంక్షేమ, బీసీ వెల్ఫేర్, వసతి గృహాలు మొదలగు వాటికి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశం లో డి.ఆర్.ఓ సత్తిబాబు , ఆర్.డి.ఓ లు , తహసిల్దార్లు పాల్గొన్నారు. Spread the love టపా నావిగేషన్ మహిళలు,పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత కల్పించాలి-విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బేటీ బచావో – బేటీ పడావో