సాలూరు RTC కాంప్లెక్స్ జంక్షన్ వద్ద హెల్మెట్ ధరించే ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారిపై కేసులు నమోదు చేసి, గరిష్టంగా రూ.1,035/- వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. హెల్మెట్ ధరించిన వారిని ప్రోత్సహిస్తూ కూల్ డ్రింక్స్ అందజేశారు. జనవరి 2026 నుండి ఇప్పటివరకు 23 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా, వారికి రూ.10,000/- చొప్పున జరిమానా విధించబడింది మరియు కొంతమందిని జైలుకు పంపించడమైంది . ఇప్పటి వరకు పట్టణ పరిధి లో 65 ఓపెన్ డ్రింకింగ్, 13 ఓవర్ లోడ్, 250 టౌన్ న్యూసెన్స్ కేసులు నమోదు చేయబడ్డాయి. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సాలూరు టౌన్ పోలీసులు సూచించారు. Spread the love టపా నావిగేషన్ సాలూరు పట్టణం లో చోరీ