సాలూరు: పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ శ్రీ ఎస్.వి. మాధవ రెడ్డి, (IPS) పర్యవేక్షణలో, సాలూరు టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ రోజు బొడ్డవలస గ్రామంలో “ఇంటి ఇంటికీ మన్యం పోలీస్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలను నేరుగా కలిసి సైబర్ మోసాలు, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, మహిళలు మరియు చిన్నారుల రక్షణకు సంబంధించిన చట్టాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అపరిచిత లింకులు, OTPలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదని ప్రజలకు సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల కలిగే సామాజిక మరియు వ్యక్తిగత నష్టాలపై అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. “ప్రజల భద్రతే మా బాధ్యత – ప్రజలకు చేరువగా మన్యం పోలీసులు” అనే లక్ష్యంతో ఎస్పీ గారి పర్యవేక్షణలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు సాలూరు టౌన్ పోలీసులు తెలిపారు. Spread the love టపా నావిగేషన్ హైదరాబాద్ నుంచి భోగాపురంకి తొలిసారి విమానయాణం జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ సాలూరులో ధర్నా