పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు

సాలూరు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(సాలూరు ప్రెస్ క్లబ్) సుమారు 40 మందికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల సమక్షం లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమ్యూనిటీ హాల్ లో ఈ రోజు  నూతన కార్యవర్గం ఏర్పాటు జరిగింది. ఈ కార్యవర్గానికి అధ్యక్షులుగా బాలి విశ్వేశ్వర రావు, ఉపాధ్యక్షులుగా అనపర్తి రాము, కార్యదర్శిగా ఆరంగి సీతారాం, సహ కార్యదర్శిగా అల్లు శ్యాం, కోశాధికారిగా కూనిశెట్టి రామ మోహన్, సభ్యులుగా లక్కోజు శ్రీనివాసరావు, రేపాక కూర్మారావు,  వజ్జ శంకర్రావు, బాలి వెంకటేష్, చాపా రాజు, ముగడ కిరణ్ కుమార్, బోగి జగదీశ్ లు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ అసోసియేషన్  జర్నలిస్టులకు ఆపద సమయం లో అండగా ఉంటుందని వృత్తిపరమైన సమస్యలను  పరిష్కరించే దిశగా కృషి చేస్తుందని ఈ కార్యవర్గం రెండు సంవత్సరాలు తమ విధివిధానాలను అనుసరించి నడవడం జరుగుతుందని తదుపరి  నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరుగుతుందని జర్నలిస్టు పెద్దలు తెలిపారు. ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి అన్ని విధాల సహకరించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ  నూతన కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి