* *పండగ వాతావరణం మాదిరిగా ఉత్సాహం ఆనందాల మధ్య చిన్నపిల్లలు మహిళలు నృత్యం చేస్తూ ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరిగింది*

*పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల పెద్ద శాఖ గ్రామములో ఆదివారం ప్రపంచ ఆదివాసి గిరిజన సంఘం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అడివి తల్లి విగ్రహం యొక్క ఫోటోకు పూలదండ వేసి మహిళలు చిన్నపిల్లలు నృత్యాలు చేస్తూ డప్పు వాయిద్యాలతో గ్రామమంతా తిరుగుతూ ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరపడం జరిగింది*
* *ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసి గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ కొమరాడ మండల నాయకులు కొండ గొర్రె మధు బిడ్డక మధు హెచ్ రామారావు మండంగి చిట్టిబాబు కైలాస్ మహిళా సంఘం నాయకులు లక్ష్మమ్మ* *సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వాకాడ ఇందిరా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కోశాధికారి కొల్లి సాంబమూర్తి మహిళా సంఘం నాయకులు పార్వతమ్మ లక్ష్మమ్మ కెవిపిఎస్ ప్రసాద్ గారు రైతు సంఘం నాయకులు శివుని నాయుడు*
*మాట్లాడారు.*
*కేంద్ర మరియు రాష్ట్ర* *ప్రభుత్వాలు తక్షణమే ఒకటి బై 70 చట్టం కోసం కౌంటర్ దాఖలు చేయాలని*
*నాన్ షెడ్యూల్ లో ఉన్న గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని జీవో నెంబర్ 3పగటిబందీగా* *అమలు చేయాలని*
*ఉద్యోగ మరియు* *ఉపాధ్యాయ నియామకాల్లో*
*100% రిజర్వేషన్లు కల్పించే చట్టం చేయాలని డిమాండ్* చేశారు. *కాబట్టి వెంటనే*
*ప్రభుత్వం నాన్చుడు ధోరణి వలన గిరిజన ప్రజలు* *తీవ్రంగా నష్టపోతున్నారని, అందుకోసమే ఈరోజు అనగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ప్రజా సంఘాలు, ఆధ్వర్యంలో పెద్ద శాక గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు , గిరిజన మహిళలు విద్యార్థులు చిన్న పిల్లలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు*

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి